20-06-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 19: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇబ్రహీంప ట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మ ండలం బాటసింగారం గ్రామంలో రూ.2.20 కోట్ల నిధులతో బాటసింగారం కమాన్ నుంచి కొత్తగూడెం చౌరస్తా వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా వేడుకలను ఏర్పాట్లు చేశారు.
రాహుల్ జన్మదినం పురస్కారించుకొని ఎ మ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భవితరాల ప్రధాని రాహుల్ గాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని.. అదేవిధంగా భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. దేశం లో ఉన్న మతతత్వ పార్టీలను తరిమి కొట్టాలని.. దేశ ప్రజల కష్టాలను తీర్చేవిధంగా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలన్నారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న శ్రీ వాసవి సాయి శ్రీనివా స దేవాలయం 3 వ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, మాజీ ఎంపీటీసీ కేశెట్టి వెంకటేశ్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులుపాల్గొన్నారు.