16-06-2025 05:29:46 PM
హైదరాబాద్: ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula-E Race Case)లో అవినీతి నిరోధక బ్యూరో(Anti-Corruption Bureau) విచారణ ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)ను ఎడు గంటల పాటు ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా హెచ్ఎండీఏ నిధులు దుర్వినియోగంపై కేటీఆర్ కు వరుసగా 60 ప్రశ్నలను ఏసీబీ సంధించింది. అధికారులు అడిగిన ప్రశ్నాలకు కేటీఆర్ బదులిస్తూ తాను ఎక్కడా లబ్ధి పొందలేదని, అగ్రిమెంట్ల వ్యవహారం అధికారులే చూసుకున్నారని తెలిపినట్లు సమాచారం. స్పాన్సర్ వెనక్కి తగ్గడంతో హెచ్ఎండీఏ నిధులతో ఫీజులు చెల్లించామని తెలిపారు. ఫార్ములా ఈ- రేస్ కేసులో కేటీఆర్ ను రెండోసారి విచారించిన ఏసీబీ అధికారులు అవసరమైతే మరోసారి పిలుస్తామని కేసీఆర్కు తెలిపారు.
ఫార్ములా-ఇ రేస్ కేసులో విచారణకు హాజరయ్యే ముందు నందినగర్ నివాసానికి చేరుకున్న కేటీఆ,ర్ మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థలకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉండడంతో ఈ ఏడాది జనవరిలో ఒకసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు.