16-06-2025 08:36:36 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) సోమవారం స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఆయన జ్వరంతో సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రి(Sunshine Hospital)లో చేరారు. సాయంత్రం తెలంగాణ భవన్ లోనే అస్వస్థతకు గురైనా హరీశ్ రావు బీపీ పరీక్షించుకున్నారు, అనంతరం కుటుంబ సభ్యులు వెంటనే సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు.