కేటీఆర్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
24-07-2026 02:53 PM
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.






