డెంగ్యూ మరణాలపై కేటీఆర్ ఆందోళన.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీకి డిమాండ్
సమాచారాన్ని ఎవరు, ఎందుకు దాస్తున్నారు?
ఆసుపత్రుల్లో ఔషధాలు లేవు
రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన సమస్యను గుర్తించి తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సోమవారం సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోందని కేటీఆర్ అన్నారు. డెంగీతో 8 మంది మరణించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నట్లు సూచించారు. సమాచారాన్ని ఎవరు, ఎందుకు దాస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో తగిన ఔషధాలు లేవని ఆరోపించారు. చాలా దవాఖానాల్లో ఒక్కో బెడ్ పై ముగ్గురు, నలుగురు ఉంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమస్య తీవ్రతను గుర్తించాలని కేటీఆర్ కోరారు.






