రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన కేటీఆర్
28-07-2026 01:20 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు, ఐటీ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ అంశాలపై అశ్విని వైష్ణవ్కు వినతిపత్రం అందజేశారు. అలాగే మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ రైల్వే లైన్ పై కూడా చర్చించినట్లు సమాచారం. ఆపై యూకే పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన ఉదయ్ నాగరాజ్ (తెలంగాణ) సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.






