15-07-2025 11:01:39 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి,సిఎండిఎ డా.టి.కె.శ్రీదేవిని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుండి దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వెనుకబడి ఉన్నటువంటి నాగులూరు,డి పోచంపల్లి, దుండిగల్ గ్రామాలు, అలాగే లంబాడి తండాలలో అభివృద్ధి, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.