17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కుర్వపల్లి ప్రజా గోస తీర్చండి

08-11-2025 08:14 PM

జడ్చర్ల: మండల పరిధిలోని కుర్వపల్లీ గ్రామంలో ఈద్దుల చెరువు నిండి ప్రవహించే కాల్వను అక్రమంగా మూసివేయడం వలన పెద్ద వర్షం వొచ్చినప్పుడు ఆ చెర్వు నీరు కుర్వపల్లీ గ్రామాన్ని ముంచివేస్తుందని, ఇట్టి విషయం కలెక్టర్ కు ప్రజావాణి రోజు దరఖాస్తు ఇచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదని బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ కొంగలీ శ్రీకాంత్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన కూడా గ్రామం సమస్య తీరడం లేదని గ్రామ ప్రజలు  కొంగలీ శ్రీకాంత్ కుల సంఘం నాయకులు తెలిపారు. దీంతో పాటు తప్పట్టి శ్యామ్, లక్ష్మణ్, నర్సిములు గ తో కుర్వపల్లీ గ్రామంలో తిరిగి ప్రజా సమస్యలు  తెలుసుకున్నారు. ఈ సమస్య ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామం నాయకులు లింగం,వేణు, ఆంజనేయులు, మహేష్, కుర్మయ్య, శ్రీశైలం, వెంకటయ్య, చిన్నయ పాల్గొన్నారు.