18 April, 2026 | 10:03 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

24-06-2025 12:28 AM

ఎల్బీనగర్, జూన్ 23 : పెట్టుబడిదారుల కోసం కార్మికులను పాలకులు బలి చేస్తున్నారని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నా లుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ సరూర్ నగర్ సర్కిల్ కన్వీన ర్ మల్లెపాక వీరయ్య డిమాండ్ చేశారు. చైతన్యపురి డివిజన్ లోని మున్సిపల్ కార్మికుల తో సోమవారం సమావేశమయ్యారు. జులై 9న నిర్వహించనున్న దేశవాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సమ్మె బుక్ లేటు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మల్లెపాక వీరయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కో డ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు రూ, 26వేలు ఇవ్వా లని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఆసంఘటిత కార్మికులు, వ్య వసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక బాధ్యత కల్పించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ కవరేజీ ఇవ్వాలని, ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులుపాల్గొన్నారు.