calender_icon.png 20 June, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీలో ప్రసవ వేదన!

20-06-2025 12:00:00 AM

  1. రహదారులు లేక గర్భిణుల అవస్థ

దవాఖానకు వెళ్లాలంటే డోలి నే శరణ్యం

కిలోమీటర్లమేరమోత

భద్రాద్రి కొత్తగూడెం, జూన్19 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ లోని గిరిజన గ్రామాల్లో నేటికీ అనేక మండలాలకు సరైన రవాణా సౌకర్యం లేక గర్భిణీలకు ప్రసవ వేదన తప్పడం లేదు. వై ద్యం కోసం కొన్ని కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉంది. ఏజెన్సీల్లో కొన్ని గ్రామాల్లో నడవడానికి రహదారులు లేక, గుట్టల్లో రహదారి ఏర్పాటు చేసుకొని ఆ మార్గం నుండా రాకపోకలు సాగిస్తున్నారు.

జిల్లాలోని పినపాక, కరకగూడెం, చర్ల, దమ్ముగూడెం, గుం డాల, ఆళ్లపల్లి మండలాల్లో గర్భిణీలకు వర్షాకాలం డోలీ యే శరణ్యం గా మారిందని చె ప్పాలి. ఇటీవల పినపాక మండలం టి  కొత్తగూడెం గ్రామానికి చెందిన మిడియం జానకి అనే గిరిజన మహిళకు పొలిటి నొప్పులు రావడంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు మంచానికి డోలి కట్టి మూడు కిలోమీటర్ల మేర మోసుకోవచ్చిన సంఘటన నెలకొంది. ఆ తరువాత 108 అంబులెన్స్ వాహనం సహాయంతో మణుగూరు కు తరలించారు. ఏజెన్సీ గ్రా మంలో ఇది ఒక మచ్చుతునక మాత్రమే.

 గర్భిణీలకు ప్రస్తావ వేదన 

ఏజెన్సీలో గర్భిణీలకు తిప్పలు తప్పడం లేదు. ఆయా మండలాల పరిధిలో ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వాటికి దూరంగా మారుమూల ప్రాంతాలు ఉండటంతో వైద్య సేవలు అందరి ద్రాక్ష అనే చెప్ప వచ్చు. ప్రభుత్వం  గిరిజనులకు ఎప్పటికప్పుడు వైద్యం అందించాలనీ చెపుతున్న గర్భిణీలకు మాత్రం సరైన వైద్యం అందడం లేద ని ఆరోపణలు వెలబడుతున్నాయి.

గతంలో ఏజెన్సీల్లో వైద్యం అందక శిశు, గర్భిణీలు, బాలింతల మృతి చెందిన సంఘటనలు అనేకమున్నాయి. ఆ పరిస్థితి కొంత మెరుగైన ప్పటికీ ,ప్రస్తుతం గర్భం దాల్చిన స్త్రీలు ప్రస్తవం నాటికి వైద్యం అందుతుందో లేదో అనీ బిక్కుబెక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తీరా పురిటి నొప్పుల సమయానికి వసతులు సరిగా లేకపోవడంతో గర్భిణీ లు యాతన పడుతున్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చిన డోలీల్లో మోసుకొ ని రావలసిన పరిస్థితి నేటికీ ఉంది.

మారని రహదారులు 

జిల్లాలోని అనేక ఏజెన్సీ గ్రామాలకు నేటికీ సరైన రహదారు లేకపోవడంతో గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు రోడ్డు  సౌకర్యం లేకపోవడం, వాగులపై వంతెనలు లేక రవా ణా సౌకర్యం అంతంత మాత్రమనీ చెప్పాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో వాగులపై వంతల ను మంజూరైన అసంపూర్తిగా ఉండటం, కొన్ని వాగులపై వంతెనలు లేక వాగోలు దాటాల్సిన పరిస్థితి ఉంది.

ఒక్క చర్ల మండలంలోని 10 నుంచి 15 గ్రామాలకు ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందంటే, మారుమూల ఏజెన్సీ మండలాల పరిస్థితి ఎలా ఉంటుం దో చెప్పాల్సిన పని లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమనెవరూ పట్టించుకోవడంలేదని గిరిజనులు గోడువెళ్ల పోసుకుంటు న్నారు.

కొన్ని గ్రామాలకు అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి నేటికీ ఉంది. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన రోడ్డు సౌకర్యం, విద్యా వైద్యం అందేలా చూడాలని అడవి బిడ్డలు కోరుతున్నారు.