17-06-2025 12:00:00 AM
గర్వకారణంగా నిలిచిన నరేందర్
ఇస్తాంబుల్, జూన్ 16: ఇస్తాంబుల్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మహా ఏఐ వ్యవస్థాపకుడు డాక్టర్ నరేందర్ చింతా ము తెలంగాణ కోసం రూ. 16 లక్షల కోట్ల (200 బిలియన్ డాలర్లు) విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ ప్రాజెక్టులను తెలం గాణ అభివృద్ధి కోసం ఆయన రూపొందించారు.
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ, ఆరో గ్యం, వ్యవసాయం, ఎనర్జీ రీసెర్చ్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఇది కేవలం పెట్టుబడి ప్రతిపాదన మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత అని నరేందర్ పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయన్నారు.