18 August, 2026 | 4:52 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

పారిస్ ఒలింపిక్స్: సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి

04-08-2024 05:20 PM

పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్యసేన్ అందరినీ నిరాశ పరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్కెల్సన్ చేతిలో లక్ష్యసేన్ 22-20, 21-14 తేడాతో ఓటమి  పాలయ్యారు.

సెమీస్ లో మ్యాచ్ ప్రారంభంలో లక్ష్యసేన్ అద్భుతంగా రాణించడంతో మొదటి సెట్ లో గెలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ విక్టర్ అక్సెల్సెన్ చివరి దశలో  20-22 తేడాతో విజయం సాధించాడు. రెండో సెట్ ను 14-21 తేడాతో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్ సోమవారం కాంస్య పతకం పోరులో తలపడనున్నారు. రేపు సాయంత్రం లీజీ(మలేషియా)తో  లక్ష్యసేన్ తలపడనున్నారు.