01-06-2025 12:00:00 AM
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్
న్యూఢిల్లీ, మే 31: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను నేనే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రె స్ నేతలు.. కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ శనివారం ఎక్స్లో ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టారు. ‘21 రోజుల్లో ఇది 11వ సారి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను నేనే తగ్గించానంటూ ట్రంప్ పదేపదే చెబుతున్నారు.
రెం డు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి తాము జోక్యం చేసుకున్నామని, వాణిజ్యాన్ని సాధనంగా వాడుకున్నామని చెబుతున్నారు. చివరికి కోర్టులోనూ అదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ ట్రంప్ ప్రకటనలపై అతడి స్నేహితుడు, భారత ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌ నంగా ఉంటున్నారు. ఆయన ఎం దుకు మాట్లాడటం లేదు’ అంటూ ప్రశ్నించారు.