07-02-2026 07:04:43 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): ఉపాధి హామీ పనులకు ఎక్కువ సంఖ్యలో కూలీలు హాజరుకావాలని తాడువాయి మండల ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి(Taduvai In-charge MPDO Savitha Reddy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉపాధి హామీ పనులను ఉపయోగించుకుని కూలీలు లబ్ధి పొందాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో కొలతల ప్రకారమే కూలీలకు డబ్బులు చెల్లించబడతాయన్నారు. కూలీలు ఇది గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.