calender_icon.png 13 June, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర నిరూపణలో సరికొత్త టెక్నాలజీ

13-06-2025 12:12:09 AM

  1. ఎస్పీ జానకి షర్మిల 

12 పోలీస్ స్టేషన్లకు అంబిస్ పరికరాలు పంపిణీ

నిర్మల్, జూన్ 12(విజయక్రాంతి):  నేరా ల నియంత్రణకు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు కొత్తగా మంచూరైన టెక్నాలజీ సామాగ్రిని గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నేరగాళ్లు తెలివి మీరుతున్నారు, దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు,

గతంలో వేలి ముద్ర ల ఆధారంగానే నేర దర్యాప్తు చేసేవారు, కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక అంబిస్ టెక్నాలజీతో కాలి ముద్రలు, ఐరిస్, ముఖ కవళికలు, ఎత్తు, బరువు చేతి రాత, ఇలా ప్రతి విషయాన్ని  నమోదు చేయవచ్చు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం12 పోలీసు స్టేషన్లకు ఈ అంబిస్ పరికరాలను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ గతంలో అఫిజ్ టెక్నాలజీ ఉపయోగించి లైవ్ స్కానర్ ద్వారా నేరగాళ్ల వేలిముద్రలు,అర చేతి ముద్రలు మాత్రమే తీసుకునేవాళ్ళం ,కానీ ఇప్పటి నుండి అత్యాధునిక టెక్నాలజీ అయిన అంబిస్ ను ఉపయోగించడం జరుగుతుంది.  ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా నేరగాళ్ళ యొక్క పూర్తి సమాచారం అనగా ముఖ కవళికలు, ఐరిస్ (కళ్లు), ఎత్తు, బరువు, పాదముద్రలను తీసుకొని డేటాబేస్ సర్వర్‌లో నిక్షిప్తం చేయడం జరుగుతుం ది.

తద్వారా ఆ నేరగాళ్లు మళ్ళీ ఎప్పుడైన నేరం చేసి పట్టుబడినప్పుడు ఈ అంబిస్ టెక్నాలజీ ఉపయోగించి, నేరగాళ్లను చాలా సులభంగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఫింగ ర్ ప్రింట్ లైవ్ స్కానర్, ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసు కోవాలని, ఈ డివైస్ ల వినియోగం గురించి ఎలాంటి సందేహాలున్న ఫింగర్ ప్రింట్ ఇం చార్జి ఏ.ఎస్‌ఐ కిరణ్‌తో  నివృత్తి చేసుకోవాలని అన్నారు.

సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ మరియు ఎం.ఎస్.సి.డి పాపిలోన్ డివైస్ ల పై  నైపుణ్యత కలిగి తమ,తమ పోలీసు స్టేషన్ లలో నమోదు అవుతున్న వివిధ రకాల నేరాలు, సస్పెక్ట్ చెక్ పింగర్ ప్రింట్స్ సేకరించి, కేసుల చేదనకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.

ప్రతి ఒక్కరూ కూడా తమ విధులలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో నిబద్దతితో పని చేయాలని, తమ కు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఉపేందర్ రెడ్డి, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపిఎస్, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు నైలు,ప్రవీణ్ కుమార్, క్రిష్ణ,డి.ఎస్.బి ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఆర్‌ఐ లు రాం నిరంజన్ రావ్ (అడ్మిన్), శేఖర్, రామక్రిష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్సైలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.