13-06-2025 12:12:02 AM
ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని పిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. కేటీఆర్కు సీఎంను విమర్శించే స్థాయి లేదన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది చిల్లర నాయకులు రోడ్లమీదికి వచ్చి ప్రేలాపాలు పేలుతున్నారని, మేం మాట్లాడితే చెవుల్లోంచి రక్తాలు కారుతాయని, కానీ తమకు సంస్కారం అడ్డొస్తుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ లాగా తండ్రి పేరుచెప్పుకొని రాజకీయాల్లో ఎదగలేదన్నారు. తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్, ఐదారుగురిని వెంటేసుకొని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డా రు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నోరు అదుపు లో పెట్టుకోవాలని, చిల్లర మాటలు మాట్లాడితే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలి..
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ డీసీసీకి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గురువారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో దివాళాతీసిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్రెడ్డి గాడిలో పెడుతూ, ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.