03-06-2025 12:00:00 AM
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ గోవర్ధన్రెడ్డి పిలుపు
ముషీరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి) : రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలకు హాని కలిగించినట్లయితే పౌర సమాజం తరపున న్యాయవాదులు నిలబడాల్సిన అవస రం ఉందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రి బ్యు నల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే న్యాయవాదులు, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటుందన్నా రు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు కూడా సమాజంలో ఒక భాగమే అన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామం లో న్యాయవాదుల స్ఫూర్తి తీసుకొని, తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో పాలుపం చుకొని, విద్యార్థులకు ఉద్యమకారులకు వె న్నుదండుగా ఉంటూ కులమత రాజకీయాలకు అతీతంగా, తెలంగాణనే మన నాయ కుడని, తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో మనకంటూ ఓ స్థానాన్ని కల్పించి, భవిష్యత్ తరానికి ఓ మార్గ దర్శకులుగా నిలబడిన న్యాయవాదుల పాత్ర గొప్పదన్నారు.