calender_icon.png 7 June, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకులు సహకరించడం లేదు

07-06-2025 01:43:13 AM

మీనాక్షికి ఫిర్యాదు చేసిన శక్తి అభియాన్ నాయకులు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ అనుబంధ విభాగం శక్తి అభియాన్‌ను బలోపేతం చేయడానికి జిల్లాల్లో స్థానిక నాయకులు ఎవరూ సహకరించడం లేదని శక్తి అభియాన్ మహిళా నాయకురాళ్లు ఏఐసీసీ రాష్ర్ట వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో శక్తి అభియాన్ నాయకులతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. శక్తి అభియాన్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో వారి ద్వారా మీనాక్షి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా శక్తి అభియాన్ నాయకులు మాట్లాడుతూ.. తాము శక్తి అభియాన్ కమిటీలు  ఏర్పాటు చేయాల్సి ఉందని, అయితే జిల్లాల్లో పర్యటించినప్పుడు స్థానిక నాయకుల నుంచి సహకారం అందడం లేదని తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఉంది కదా? మళ్లీ మీరెందుకు? మీ కమిటీలు ఎందుకు? అన్నట్లుగా కొంత మంది నాయకులు మాట్లాడుతున్నారని వాపోయారు.

పార్టీ పరంగా స్థానిక నాయకులకు లిఖిత పూర్వకంగా ఆదేశమిస్తే తమకు సహకరిస్తారని కోరారు. సమీక్షలో శక్తి అభియాన్ నాయకురాళ్లు మెర్సి ప్రియాంక, అత్రం సుగుణ, విజయ, ఆస్మా తబ్సుమ్, రమణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.