07-06-2025 01:42:55 AM
జిల్లా కలెక్టర్ దివాకర
ములుగు,విజయక్రాంతి: ములుగు జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఛాంబర్లో జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ ,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు లతో కలసి అటవీ,డిఆర్డిఓ,నీటిపారుదల,వ్యవసాయం, హార్టికల్చర్, జిల్లా విద్య,మునిసిపల్ & పట్టణ అభివృద్ధి అధికారులు, పోలీసులు, పశుసంవర్ధక, ఆరోగ్యం,వైద్య &కుటుంబం, విద్యుత్తు, గిరిజన సంక్షేమం ఐటిడిఏ అధికారులతో వన మహోత్సవం కార్యక్రమ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా ప్రణాళికబద్ధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యానవన శాఖకు కేటాయించే లక్ష్యాలకు అనుగుణంగా పొలం గట్లపై ఉద్యానవన మొక్కలు నాటడంపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.