calender_icon.png 7 October, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం

07-10-2025 12:45:13 AM

కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ

రాజన్న సిరిసిల్ల: అక్టోబర్ 06(విజయక్రాంతి) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్ను డి-అడిక్షన్ /రిహాబిలిటేషన్ సెంటర్, బస్తీ ఆసుపత్రి, రాజీవ్ నగర్, సిరిసిల్లలో సోమవారం ఏర్పా టు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ తెలియజేశారు.

ఈ సందర్భం గా రాధిక జైస్వాల్ మాట్లాడుతూ. సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో, జిల్లా ప్రధా న న్యాయమూర్తి .పి.నీరజ మార్గదర్శకత్వంలో, డిఎంహెచ్వో. రజిత. సమన్వయం తో పోలీస్ సూపరింటెండెంట్.గీతే మహేష్ బాబాసాహెబ్.

అనుమతితో న్యాయ సహా య క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో . చింతోజు భా స్కర్, లోక్ అదాలత్ సభ్యులు, శ్రీ.ప్రవీణ్, మానసిక వైద్య నిపుణులు, మణివర్మ, మెడికల్ ఆఫీసర్, ఈ. స్వాతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.