5 March, 2026 | 4:51 AM

జీవితాల్లో వెలుగులు నింపాలి

05-03-2026 12:00 AM

పారిశుద్ధ్య కార్మికులతో అనిల్ కుమార్ యాదవ్  హోలీ సంబురాలు

శేరిలింగంపల్లి, మార్చి 4 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జిహెచ్‌ఎంసి పారి శుద్ధ్య కార్మికులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో హోళీ సంబరాలు జరుపుకొన్నారు. బుధవారం పారిశుద్ధ్య కార్మికులంతా తమ విధులు నిర్వహిస్తూ అనిల్ కుమార్ యాదవ్‌కు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపి రంగులు పూశారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగుల హోలీ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. హోలీ పండుగ  సంబరాలను శాంతియుత వాతావరణంలో ప్రశాం తంగా జరుపుకోవాలని కోరారు.