మియాపూర్లో ఎండిఏంఏ డ్రగ్స్ కలకలం
- ముగ్గురు నిందితుల అరెస్ట్
12.6 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం
శేరిలింగంపల్లి, మార్చి 4 (విజయక్రాంతి): భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపింది. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండిఏంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నింది తులను అదుపులోకి తీసుకున్నట్లు మియాపూర్ సీఐ శివప్రసాద్ తెలిపారు. విశ్వసనీ య సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం సమయంలో విశ్వంభర కాలనీ పార్క్ సమీపంలో ఒక వోక్స్ వ్యాగన్ కారు లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు.
దీనిపై వెంటనే స్పందించిన మియాపూర్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసు బృందం అక్కడికి చేరుకుని సదరు వాహనాన్ని తనిఖీ చేశారు. పోలీసులను గమనించి నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అదుపు లోకి తీసుకున్నామన్నారు. వాహనాన్ని క్షు ణ్ణంగా తనిఖీ చేయగా, కార్ డ్యాష్ బోర్డ్లో తెల్లటి క్రిస్టలైన్ పదార్థం లభ్యమైందన్నారు. డ్రగ్ డిటెక్షన్ కిట్తో పరీక్షించగా అది 12.6 గ్రాముల ఎండిఏంఏగా నిర్ధారణ అయినట్లు తెలిపారు.
నిందితులు బేరి హనుమంతు (27), భూమని మహేష్ (26), కాసం ఆదర్శ్ (28)లను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా వీరు బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్లో అధిక లాభాలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్దనుంచి డ్రగ్స్తోపాటు, ఒక వోక్స్ వ్యాగన్ కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.




