టెక్నాలజీ ఫండ్ను ఆవిష్కరించిన ఎల్ఐసి
ఫిబ్రవరి 2026: ఏఐ, డేటా సెంటర్లు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లను లక్ష్యంగా చేసుకున్న ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ తమ ఎల్ఐసి ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. సాంప్రదాయ ఐటి సేవలకు మించి భారతదేశం యొక్క విస్తరిస్తున్న సాంకేతిక రంగాన్ని సమగ్రంగా అన్వేషించటానికి రూపొందించబడిన ఒక థీమాటిక్ ఈక్విటీ పథకంగా చెబుతున్నారు. ఈ ఫండ్ కొనసాగుతున్న సబ్స్క్రిప్షన్ మరియు రిడెంప్షన్ కోసం మార్చి 19, 2026న తిరిగి తెరవబడుతుంది.
ఈ ఫండ్ ను శ్రీ కరణ్ దోషి, శ్రీ జైప్రకాష్ తోష్నివాల్ సంయుక్తంగా నిర్వహిస్తారు. బిఎస్ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (టిఆర్ఐ)కి అనుగుణంగా బెంచ్మార్క్ చేయబడుతుంది.
సాంప్రదాయ ఐటీ-కేంద్రీకృత ఆఫర్లకు భిన్నంగా, ఎల్ఐసి ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్ సెమీకండక్టర్-అనుసంధానిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్లు, ఇంటర్నెట్ వ్యాపారాలు మరియు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్తో సహా విస్తృత శ్రేణి టెక్నాలజీ ఆధారిత రంగాలలో మూలధనాన్ని కేటాయించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఆర్ .కె . ఝా మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 2026–27 సెమీకండక్టర్ అభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాల పట్ల ప్రభుత్వం యొక్క లక్ష్యాలను గుర్తు చేశారు. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ నుండి ఏఐ స్వీకరణకు పురోగమిస్తున్నందున, లిస్టెడ్ ఈక్విటీలలో బహుళ-సంవత్సరాల నిర్మాణాత్మక అవకాశాన్ని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీ యోగేష్ పాటిల్ మాట్లాడుతూ తమ పెట్టుబడి వ్యూహం కేంద్రీకృతమైన దానికంటే వైవిధ్యభరితమైన టెక్నాలజీ పోర్ట్ఫోలియోను నిర్మించడమే లక్ష్యమని తెలిపారు.




