calender_icon.png 27 June, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం

26-06-2025 09:52:36 PM

అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. కవిత..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం అవుతుందని, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.కవిత(Additional Senior Civil Judge K. Kavita) అన్నారు. కొత్తగూడెంలో ఉన్న శ్రీ రామచంద్ర ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం(Anti-Drug Day) సందర్భంగ జరిగిన న్యాయ చైతన్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యువతకు బాధ కలిగినప్పుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి దాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగ ఉంటూ ఆరోగ్యకరమైన జీవితం గడపాలని సూచించారు.

విద్యార్థి దశలో క్రమశిక్షణ కలిగి చెడు అలవాటుకు దూరంగా ఉండాలని తెలిపారు. డ్రగ్స్ వినియోగం సమాజంలో అతిపెద్ద సమస్యగ మారిందని ముఖ్యంగ యువత వాటి భారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన నిశితంగా పరిశీలిస్తుండాలని కోరారు. 

కార్యక్రమం అనంతరం న్యాయమూర్తి  విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తమరావు, డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ సాహితీ, పావని, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ, డి.రమేష్, వైస్ ప్రిన్సిపల్ డా. ఎం.పూర్ణ, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ చందర్ రావు, డా.ఎన్. శ్రీదేవి, పి. శ్రీనివాసరావు, న్యాయవాదులు ఎండి సాధిక్ పాషా, మారపాక రమేష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.