10-06-2025 09:42:37 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam)లో మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు భద్రాచలం బస్టాండ్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం డ్రైవర్లకు, ప్రయాణికులకు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిరోజు క్రమం తప్పకుండా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా మంగళవారం నాడు లయన్స్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు యోగి శివ శంకర నాయుడు సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రాష్ట్ర నాయకులు వై సూర్యనారాయణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కమల రాజశేఖర్ కార్యదర్శి ఎం సిద్ధారెడ్డి, సభ్యులు దాట్ల రాజు రామలింగేశ్వరరావు ఆర్టీసీ అధికారులు సిబ్బందితో పాటు పాల్గొన్నారు.