రుణమాఫీ పక్కాగా అమలు చేస్తాం

29-04-2024 12:12:29 AM

l పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు

పెద్దపల్లి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రైతులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శాస్త్రీ నగర్‌లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే దేశంలో 5 న్యాయ్ గ్యారెంటీలను అమలు చేస్తుందని వెల్లడించారు. ప్రచారంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.