24 April, 2026 | 4:22 PM

ఉపాధి హామీ పని గంటలను తగ్గించండి

24-04-2026 02:52 PM

బోథ్,(విజయక్రాంతి): వేసవి కాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పని గంటలను నాలుగు గంటలకు బదులు మూడు గంటలు చేయాలని ఉపాధి హామీ కూలీలు కోరారు. శుక్రవారం మండలంలో ని జీడిపల్లి గ్రామంలో కూలీలు చేపడుతున్న పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్ ఎంపీడీవో రమేష్ లతో కలిసి పరిశీలించారు, ఉదయం 6 గంటలకు పనికి వచ్చి సకాలంలో పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని అధికారులు కూలీలకు తెలిపారు, ఆయన వెంట పంచాయతీ అధికారి అంజయ్య ఈసీ మధుకర్ టి ఏ లు ఎస్ఏలు మెట్లు పాల్గొన్నారు