15-06-2025 07:49:28 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి జయంత్ సింగ్ చౌదరి ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన పలు అంశాలపై చర్చి, ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సోమవారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి జయంత్ సింగ్ చౌదరి ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు.
యువత ఉపాధికి సిద్ధంగా ఉండేలా నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి జయంత్ చౌదరి ఆరా తీశారు. రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుతో సహా వివిధ ముందస్తు చర్యల గురించి కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించిన కేంద్ర మంత్రి వాటికి కేంద్రప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. రేపు కౌశల్ మందన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి జయంత్ చౌదరి పాల్గొననున్నారు.