18-06-2025 12:00:00 AM
సూర్యాపేట, జూన్ 17 (విజయక్రాంతి) : పట్టణంలోని చర్చి కాంపౌండ్ రోడ్డులో గల ఎల్. ఎస్.బేకరీ పై సీతారాంపురం ప్రాంతానికి చెందిన వారు కేక్ తిని అస్వస్థతకు గురి ఆయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విధి. అయితే ఈ విషయంపై మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటరీ సిబ్బంది మంగళ వారం ఎల్ ఎస్ బే కరీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార పదార్ధములను పరిశీలించారు.
జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని షాప్ యాజమాన్యానికి రూ. 5వేల జరిమానా విధించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, యాదగిరి,ఎన్విరాన్ మెంట్ ఇంజనీ రు శివ ప్రసాద్,వార్డ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జవాన్లు విక్రమ్,మల్లికార్జున్ పాల్గొన్నారు.