calender_icon.png 18 June, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత క్రిస్టియన్ సమాజాన్నే నిర్వీర్యం చేసే కుట్ర

17-06-2025 11:34:26 PM

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

ఇకనైనా కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం మానుకోవాలి..

క్రిస్టియన్ జేఎసీ చైర్మన్ సాల్మన్ రాజ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): దళిత క్రిస్టియన్ నేతపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని దళిత క్రిస్టియన్ నేతలు(Dalit Christian leaders) మండిపడ్డారు. మంగ్లీ బర్త్ డే వేడుకల్లో మేడే రాజీవ్ సాగర్ ఉన్నాడని చేసిన తప్పుడు ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైస్తవ నాయకులు ఆర్. మోజెస్ తో కలసి ఆయన మాట్లాడారు. ఇది కేవలం రాజీవ్ సాగర్ మీద వ్యక్తిగత దుష్ప్రచారం కాదని, దళిత క్రిస్టియన్ సమాజాన్నే లక్ష్యంగా చేసుకున్న కుట్రగా వారు పేర్కొన్నారు. రాజీవ్ సాగర్ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికే కృషి చేశాడని అతని నిష్కళంకతపై కాంగ్రెస్ పార్టీ అపవాదాలు చేస్తూ ఇది రాజకీయ కుట్రకు వాళ్లు తెరలేపారని విమర్శించారు.

తెలంగాణలో దళిత క్రిస్టియన్ సమాజంపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేపడుతుందన్నారు. దళిత క్రిస్టియన్లు రాజకీయంగా ఎదగకుండా ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. పేద, వెనుకబడిన వర్గాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ దళిత క్రిస్టియన్ నేత రాజీవ్ సాగర్ పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో  తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాలని చూస్తుందన్నారు. తెలంగాణలో దళిత క్రిస్టియన్ వర్గం ఎదుగుతున్నందునే ఈ కమ్యూనిటికి చెందిన నేతలను అణిచివేయాలన్న కుట్ర జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎదుగుతున్న నాయకులను అణచివేయాలన్న కుట్రలు నడపడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదన్నారు.

గతంలో డా.అంబేద్కర్ను కూడా అలానే అవమానించారని ఇప్పుడు అదే తంతు కొనసాగుతోందన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల దళిత క్రిస్టియన్ వర్గంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఇటువంటి కుట్రలు మనలను భయపెట్టలేరని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ కుట్ర వెనుక ఉన్న వారిపై  సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే మార్పు మొదలైంది ట్వీట్టర్ హ్యాండిల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో క్యాథలిక్ చర్చి అసోసియేషన్ సెక్రెటరీ లియో లూయిస్, క్రైస్తవ సేవా సమితి నాయకులు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.