సొంతగూటికి ‘మ్యాడం బాలకృష్ణ’

26-04-2024 12:10:00 AM

మెదక్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ నేత మ్యాడం బాలకృష్ణ సొంత గూటికి చేరారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు ఆశించి భంగపడటంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు తిరిగి పార్టీలో చేరినట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి అభినందించారని, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.