పతి గెలుపు కోసం సతి ప్రచారం

26-04-2024 12:10:00 AM

మేడ్చల్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): ఏ ఎన్నికలైనా ప్రచారంలో వినూత్న పద్ధతుల్లో ప్రచారాలు చేయడం మనందరికీ తెలిసిందే. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి రాగిడి రజిని గురువారం మేడ్చ ల్ మున్సిపల్ కేంద్రంలో పాదయాత్ర చేపట్టారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులను ఓటును అభ్యర్థిస్తు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికానర్సింహరెడ్డి, జిల్లా గ్రంథాల య సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.