23 June, 2026 | 4:59 PM

ముంపు కాలనీలను సందర్శించిన మాద్రి పృథ్వీరాజ్

23-06-2026 03:43 PM

పటాన్ చెరు: రాత్రి కురిసిన వర్షాల కారణంగా పటాన్‌చెరు పట్టణంలోని జేపీ కాలనీ GHMC డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పలు ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు మాద్రి పృథ్వీరాజ్ కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా HMWSSB మేనేజర్ ప్రేమ్ ని సంఘటనా స్థలానికి పిలిపించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాద్రి పృథ్వీరాజ్ తెలిపారు.