08-06-2025 04:29:31 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ కార్యక్రమాలు పూర్తియ్యాయి. ప్రభుత్వ లాంఛనలతో మాగంటి అంతిమ సంస్కారాలు ముగిశాయి. మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి గౌరవవందనం సమర్పించిన పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ఆయన కుమారుడు చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ దుఖిస్తూు ,చితికి నిప్పు అంటించాడు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5.45 గంలటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో గోపీనాథ్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుంది. మాగంటి అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పాడె మోశారు.