10 May, 2026 | 11:34 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ముగిసిన మహాకుంభమేళా

27-02-2025 01:00 AM

45 రోజుల పాటు కొనసాగిన పుణ్యస్నానాలు

మహాశివరాత్రి రోజు పుణ్యస్నానమాచరించిన కోటిన్నర మంది

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 26: నెలన్నరగా భక్తులను ఆధ్యాత్మిక సంద్రంలో ముంచిన మహాకుంభమేళా బుధవారంతో ముగిసిం ది. మహాశివరాత్రి సందర్భంగా చివరి అమృ త స్నానం జరగ్గా.. 1.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, సెలబ్రెటీలు త్రివేణీ సంగమం లో పుణ్యస్నానం ఆచరించారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేళా కావడంతో దేశవిదేశాల నుంచి భ క్తులు పెద్ద ఎత్తున పాల్గొని.. పుణ్యస్నానాలు ఆచరించారు.

దేశవిదేశాల్లోని హిందువుల ఐక్యతకు ఈ మేళా అద్దం పట్టింది. హిందూ ధర్మం ఎంత గొప్పదో, ప్రపంచంలో హిందూ ధర్మానికి ఎంత గొప్ప స్థానం ఉందో కూడా ఈ మేళా ద్వారా రుజువైంది. బుధవారం సాయంత్రం వరకే సుమారు 64.77 కోట్ల మంది పుణ్యస్నానం చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం చైనా, భారత్ జనాభా మాత్రమే ఈ సంఖ్య కంటే ఎక్కువ. చివరి అమృత స్నానం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

చివరి రోజును పురస్కరించుకుని ఐఏఎఫ్ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) ఎయిర్ షో నిర్వహించింది. ఈ ఎయిర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహాకుంభమేళా వల్ల ఎంతో మంది రాత్రికి రాత్రే స్టార్లుగా ఆవిర్భవించారు. కుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసా, ఐఐటీ బాబా ఇలా అనేక మందిని స్టార్లుగా మార్చింది. అంతే కాకుండా ఈ మేళా కొంత మందికి నిద్ర లేని రాత్రులనూ మిగిల్చింది. మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో 30 మంది చనియారు.