28 July, 2026 | 1:09 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

మహారాష్ట్రలో జవయోజన జనాభా కంటే ఓటర్లే ఎక్కువ

07-02-2025 03:56 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్, శివసేన-యుబిటి, ఎన్‌సిపి-ఎస్ఎస్ పార్టీలు శుక్రవారం ఆరోపించాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య  మొత్తం 39 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ విలేకరులతో మాట్టాడుతూ... మహారాష్ట్రలో గత 5 సంవత్సరాలలో  32 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారని, కేవలం 5 నెలల్లో 39 లక్షల మందిని కొత్త ఓటర్లను జోడించారని పేర్కొన్నారు. జోడించబడిన మొత్తం ఓటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జనాభాకు సమానమని, తమకు ఓటర్ల జాబితాను అందించి ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు వాటాను నిలబెట్టుకున్నందున జోడించబడిన ఓటర్లలో ఎక్కువ మంది బిజెపికి అనుకూలంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఎన్‌సిపి-ఎస్ఎస్‌కు చెందిన సుప్రియా సులే, శివసేనకు చెందిన సంజయ్ రౌత్ పక్కన ఉన్న గాంధీ, ప్రభుత్వ డేటా ప్రకారం మహారాష్ట్ర వయోజన జనాభా 9.54 కోట్లు కాగా, రాష్ట్ర ఓటర్ల జనాభా 9.7 కోట్లు అని అన్నారు.మహారాష్ట్రలోని మొత్తం వయోజన జనాభా కంటే మహారాష్ట్రలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఐదు నెలల్లో మహారాష్ట్రలో 39 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరగా, 2019 నుంచి 2024 మధ్య గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో 32 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలను ఈసీ అందించకపోతే, అది తీవ్రమైన ప్రశ్నకు లేవనెత్తుతుందని ఆయన హెచ్చారించారు. మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసే దిశగా పయనిస్తున్నాము. కానీ, రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నాం అని రాహుల్ గాంధీ విలేకరులతో చెప్పారు. తదుపరి దశ న్యాయవ్యవస్థ తలుపులు తట్టమే అని ఈసీ తామకు ఓటర్ల జాబితాలు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈసీ బతికి ఉండి చనిపోకపోతే, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లేకుంటే ఈసీ ప్రభుత్వానికి బానిస అని అర్థం అవుతుంది" అని రౌత్ అన్నారు.