calender_icon.png 4 February, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ళకు మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శైలేష్

04-02-2026 01:25:03 AM

చేవెళ్ళ, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగారా మొగిన నేపథ్యంలో బిజెపి పార్టీ మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శైలేష్ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ జెనరల్ సెక్రటరీ తుళ్ళ వీరేందర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పార్టీ శ్రేణులతో కలిసి చేవెళ్లలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీపై ప్రజాదారణ ఎన్నికల ప్రచార నిర్వహణ అభ్యర్థుల గెలుపు వ్యూహంపై ఆరా తీశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయబాహుట ఎగరవేసేందుకు పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... చేవెళ్ళ మున్సిపల్ లో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు.

శత్రుదేశం పై చేసిన సింధు ఆపరేషన్ సింధుర్ మహారాష్ట్ర విమాన ప్రమాదం చైనా దేశం ఉద్దాతంకులపై ప్రతిపక్ష నేతలు దిగజారి కామెంట్ చేయడం సరికాదని మోడీ ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నరన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్తో డీల్ కుదిరితే మోడీ ముందు ట్రంప్ తలదించు కుండని, దాన్ని దేశ ప్రధాని తల దించుకున్నాడని పార్లమెంట్ లో అనడం సబబు కాదన్నారు.

ప్రెస్ మీట్ లో మున్సిపల్ అధ్యక్షుడు అత్తేలి అనంతరెడ్డి, డా. వైభవ్ రెడ్డి, మండల అధ్యక్షుడు మున్నూరు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సర్వలింగం, ఆంజనేయులు, గౌడ్ శ్రీకాంత్ రెడ్డి, పెద్దొళ్ల దయాకర్, కేశేపల్లి వెంకటరామిరెడ్డి మున్సిపల్ అభ్యర్థులు పాల్గొన్నారు.