calender_icon.png 17 June, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన ప్రాంతంలో గిరిజన మహిళలకే ఇసుక ర్యాంపుల నిర్వహణ

17-06-2025 12:00:00 AM

- గిరిజన మహిళ ఆర్థిక అభివృద్ధి పెంచడానికి చేయూత

- ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, జూన్ 16 (విజయ క్రాంతి)ఐటీడీఏ , తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన మ హిళలకు పారిశ్రామికంగా చేయూత అందించేందుకు ఇసుకరాంపుల నిర్వహణ గిరిజన మహిళలకు అప్పగించాలని ఐటీ డీఏ పీవో రాహుల్ అన్నారు.

గిరిజన ఇసుక సొసైటీలకు ఆర్థిక సహాయం అందించి ఆదివాసి గిరిజన మహిళలు సొంతంగా ఇసుక ర్యాంపులు నడుపుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని,తమ గ్రామాలలోని కుటుంబాలకు ఉపాధి అవకాశా లు పొందడానికి ఆ గ్రామంలోని గిరిజన మహిళా సోసైటీలకే పూర్తిస్థాయిలో ఇసుక ర్యాంపులు నడిపించుకునే బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు.

సోమవారం ఐటీడీఏ స మావేశం మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీలతో ఒకరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సొసైటీ మహిళలతో ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి ఇసుక ర్యాం పుల నిర్వహణ వారికి అప్పగించకుండా మహిళలందరూ ఐకమత్యంగా ఉండి గోదావరిలో నుండి ఇసుక వెలికితీత, నిర్వహణ బాధ్యత, ఉత్పత్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న సొసైటీలు సొంతంగా ఇసుక ర్యాంపులు నిర్వహించుకోవలన్నారు.

తద్వారా ఏజెన్సీ ప్రాం తంలోని గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది జీవనోపాధి పెంపొంద వచన్నారు. నా ఉద్దేశం తోనే ఈ అవగా హన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద రెండు సొసైటీలను ఎంపిక చేసి సొసైటీ కి రూ 50 లక్షల చొప్పున ఆర్థికవేసులుబాటు కల్పించి అధికారుల సహాయంతో గోదావరిలో ఇసుక స్టాక్ పాయింట్ గుర్తించి టిప్పర్లు ప్లానింగ్ మిషన్ డోజర్లు అద్దెకు ఇప్పించడం జరుగుతుందన్నారు.

వాటి ద్వారా ఇసుక స్టాక్ పాయింట్ కి తర లించిన దగ్గర నుండి ఎన్ని క్యూబిక్కుల ఇసుక టిప్పర్ల ద్వారా రవాణా అవుతున్నది, ఇసుక స్టాక్ పాయింట్ కి చేరవేసిన దగ్గర నుండి వాటి నిర్వహణ బాధ్యత పూర్తిగా ఇసుక సొసైటీ మహిళలే నిర్వహించాలన్నారు. అంతకుముందు ఇసుక ర్యాంపుల నిర్వహణ తీరు ,ఎదుర్కొంటున్న సమస్యలను మ హిళలను అడిగి తెలుసుకున్నారు.

ఇసుక ర్యాంపులు నిర్వహించే మహిళలు ఆ గ్రామానికి సంబంధించిన వారే ఉండా లని, బినామీలను ఎవరిని దరిచేరకుండా చూడాలని, ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రతిదీ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన మహిళలకు సూచించారు. మహిళలు ఇసుక ర్యాంపుల పూర్తి బాధ్యత తీసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఇసుక ర్యాంపులు సొంతంగా నిర్వహించుకునే గిరిజన మహిళలకు సాంకేతిక సహకారం,ఆర్థిక సహకారంతో పాటు మహిళలందరికీ తగిన శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా తగిన సలహాలు, సూచ నలు అందించడం జరుగుతుందన్నారు.

పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన సొసైటీల పనితీరును చూసి మిగతా సొసైటీలు ఆదర్శంగా తీసుకునే విధంగా గిరిజన మహిళలు ఇసుక ర్యాంపు లు సమర్థవంతంగా నిర్వహించుకోవాలని, ఇసుక ర్యాంపుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసా స్పెషల్ ఆఫీసర్ మనిధర్ తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, వివిధ గ్రామాల నుండి వచ్చిన సొసైటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.