12-06-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, జూన్ 11: యువ హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన జరిగింది. శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద పారిందని విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
మరికొంత మందికి గాయాలు అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డిని వివరణ కోరగా.. తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. డయల్ 100 కు కూడా ఫిర్యాదు అందనట్లు స్పష్టం చేశారు.