అదానీకి బిగ్ రిలీఫ్
న్యూయార్క్, మే 18: భారతదేశ కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికా న్యాయస్థానం నుంచి భారీ ఊరట లభించింది. అదానీతోపాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై నమోదైన అన్ని క్రిమినల్ కేసులను తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ శాశ్వతంగా ఎత్తేసింది.
దీంతో న్యూయార్క్ కోర్టులో విచారణ స్థాయిలో ఉన్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసు ముగిసినట్లేనని తేల్చిచెప్పింది. అదానీపై ఉన్న అభియోగాలు నిరూపించేందుకు విచారణ బృందాలు ఎలాంటి కీలక ఆధారాలు సమర్పించలేకపోయాయని, కంపెనీ జరిమానాలు కూడా చెల్లిస్తానని చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చిచెప్పింది. భారత్లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందడం కోసం ౨౦౨౪లో అక్కడి ప్రభుత్వ అధికారులకు అదానీ గ్రూప్ భారీగా లంచాలు ఇచ్చేందుకు ప్రణాళికలు వేసిందనే ఆరోపణలు వచ్చాయి.
అమెరికా పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించే సమయంలో ఈ విషయాలను దాచారు. న్యూయార్క్ కోర్టులో ఈ మేరకు అదానీపై గ్రీన్ ఎనర్జీ అవినీతి కేసులు నమోదయ్యాయి. అమెరికా దర్యాప్తు సంస్థలు దీనిపై లోతైన విచారణ జరిపాయి. లంచాల ఒప్పందాలకు సంబంధించిన డిజిటల్ ఆధా రాలను సేకరించాయి.
దీంతతో కంపెనీల షేర్లు మార్కెట్లో దారుణంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టు బడిదారుల నమ్మకం దెబ్బతింది. తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. న్యాయపరమైన పోరాటం కోసం గట్టిగా ప్రయ త్నించింది. చివరకు ఈ వివాదాల పరిష్కారం దిశగా కంపెనీ చర్చలు జరిపింది. భారీ జరిమానా చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఆ నష్టపరిహారం చెల్లింపుతో ఈ కేసు ఒక ముగింపునకు వచ్చింది. అదానీ గ్రూప్ తన పద్ధతులను మార్చుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో అమెరికా కోర్టులో నడిచిన ఈ సుదీర్ఘమైన లంచాల కేసు ప్రక్రియ ముగిసింది.






