calender_icon.png 11 September, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాన ఆలయాలు మూసివేత

08-09-2025 12:44:25 AM

నిర్మల్/ఆదిలాబాద్, సెప్టెంబర్ ౭ (విజయక్రాంతి): చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన దేవాలయాలను ఆదివా రం మూసివేసించినట్లు ఆలయ అధికారులు పూజారులు తెలిపారు.

జిల్లాలోని శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర తో పాటు కదిలి అన్నపూర్ణ పాపేశ్వర ఆల యం కాల్వ నరసింహస్వామి ఆలయం గుడిసరాల రాజరాజేశ్వర స్వామి ఆలయం నిర్మ ల్ పట్టణంలోని దేవరకోట ఆలయం తదితర ఆలయాలను మూసి వేయడం జరిగిం దని ఆలయ పూజారులు తెలిపారు. సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆయా ఆలయాలు పూజలు నిర్వహించి ఆలయం లో భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం మూసివేత...

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ఆలయాలను మూసివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన జైనథ్ మండల కేంద్రం లోని శ్రీ  లక్ష్మీనారాయణ స్వామి ఆలయా న్ని సైతం పూజారులు ఆదివారం మూసివేశారు. సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ కమి టీ ప్రతినిధులు తెలిపారు.