calender_icon.png 19 June, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

19-06-2025 12:00:00 AM

కరీంనగర్, జూన్ 18 (విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుంద రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం కవంపల్లి రవి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుంద రెడ్డి, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ రాజమల్లు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా భారత కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, దీన్ని నిరసిస్తూ జూలై 9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపునిచ్చాయన్నారు.

కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు ఎర్రోళ్ల రాజయ్య, ముక్కెర బుజ్జమ్మ, కత్తెరపాక లత, జేరిపోతుల మల్లేశం, జంగం రవీందర్, రాజేందర్, రవి, తిరుపతి, నరేందర్, సంపత్ తదితరులుపాల్గొన్నారు.