25-06-2025 05:24:04 PM
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి(CITU State Vice President Tummala Veera Reddy) పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ నియోజకవర్గం విస్తృత సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ... కార్మికులకు ప్రమాదకరంగా ఉన్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలో మరింత దూకుడుగా అమలు చేస్తుందని ఆయన అన్నారు.
కార్మిక వర్గ సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని ఆయన అన్నారు. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్స్ ను అమలు ఐదు సంవత్సరాలు ఆలస్యమైనా ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే విదంగా చేస్తుంది అని అన్నారు. 2025-26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుగుణంగా కేటాయింపులు చేసింది అని ఆయన అన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలను మోపిందని అన్నారు. కార్పొరేట్ గుత్తా సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అవమానాలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోరని ఆయన మండిపడ్డారు.
హమాలి, రవాణ రంగా కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు కార్మికులకు ఉపయోగపడే విధంగా మోటార్ వాహనాల చట్టం 2019కి సవరించాలని ఆయన అన్నారు. ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నూతన కమిటీని ఎన్నుకున్నారు. సిఐటియు నల్గొండ పట్టణ కన్వీనర్ గా అవుట రవీందర్, నల్గొండ మండల కన్వీనర్ గా పోలే సత్యనారాయణ, తిప్పర్తి మండల కన్వీనర్ గా భీమ గాని గణేష్ తిరిగి ఎన్నికయ్యారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు కే విజయలక్ష్మి, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, పల్లె నగేష్, మంత్రాల మంగమ్మ, కత్తుల యాదయ్య, జేరిపోతుల సైదులు, వెంకట్ రెడ్డి, సాగర్ల మల్లయ్య, ఎర్ర సౌజన్య, పి సరిత, మిరియాల శ్రీవాణి, పెరిక కృష్ణ, పేర్ల సంజీవ, పందుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.