calender_icon.png 25 June, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తాగునీటి కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

25-06-2025 05:28:37 PM

ఎంపీడీవో ప్రవీణ్ కుమార్...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం తాగునీటి పైపులు చెడిపోయినందున దాని మరమ్మతులు చేపించారు. ఈ విషయమై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) సందర్శించి వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పైప్ లైన్లు ఎక్కడ లీకేజీ కాకుండా తాగునీటి కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు.