15-06-2025 06:51:10 PM
వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్ల లబ్ధిదారులను గుర్తించే విషయంలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వాస్తవ లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎంపీడీవో కార్యాలయ ముట్టడిని మండల వ్యాప్తంగా రాజకీయాల కతీతంగా ఇండ్లు మంజూరు కానీ పేదలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు(CPM District Secretary Group Member Maturu Balaraju), సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామిలు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సీనియర్ నాయకులు చీర్క శ్రీశైలం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత పది సంవత్సరాలుగా ఇండ్లు రాక అనేకమంది పేదలు ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేక గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల పథకంగా మారిందని దీనివల్ల నిజమైన లబ్ధిదారులు ఇండ్లు మంజూరు కాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం పునరాఆలోచన చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, వాకిటి వెంకటరెడ్డి, కందడి సత్తిరెడ్డి, మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, కల్కూరి ముత్యాలు, దుబ్బ లింగం తదితరులు పాల్గొన్నారు.