calender_icon.png 17 December, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ ను విజయవంతం చేయండి

16-12-2025 06:38:05 PM

అర్మూర్ (విజయక్రాంతి): ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న కొత్తగూడెంలో నిర్వహించే 5వ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ సమావేశాన్ని విజయవంతం చేయాలని అర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ లు కోరారు. మంగళవారం బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులతో కలిసి కర పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి వి.ఈశ్వరయ్య, అతిథులుగా కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి పాటిల్ విశ్వనాథ్, ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తి సరితలు పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో భారత రాజ్యాంగ విలువల రక్షణ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల రిజర్వేషన్ల సంరక్షణ, ఒకే దేశం – ఒకే ఎన్నిక, రాజ్యాంగబద్ధంగా మహిళల ప్రాధాన్యత, బార్, బెంచ్ గౌరవ సమన్వయంపై చర్చతో పాటు అవగాహన కార్యక్రమం ఉంటుందని అన్నారు. న్యాయవాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గజ్జల చైతన్య, కృష్ణ పండిత్, బేతు జగదీష్, చిలుక కిష్టయ్య, కృష్ణంరాజు, కొండి పవన్, గణేష్, రాజేశ్వర్  న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.