21-06-2025 01:10:37 AM
ఏఎస్ రావు నగర్, జూన్ 20 (విజయ క్రాంతి): ప్రతిఒక్కరు యోగా ను దినచర్యలో భాగంగా చేసుకుంటే తప్పకుండా మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతారని భాష్యం విద్యాసంస్థల సీఈఓ చైతన్య అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ విద్యాసం స్థల్లో మూడు రోజుల ప్రణాళికను రూపొందించారు.
మొదటి రోజు 19న ప్రైమరీ విద్యార్థులకు, రెండవ రోజు 20న హై స్కూల్ విద్యార్థులకు, మూడవ రోజు 21 న ఉపాధ్యాయు లకు, తల్లిదండ్రులకు యోగా గురించి అవగాహన కల్పిస్తూ కామన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఏ ఎస్ రావు నగర్ లోనీ భాష్యం పాఠశాల విద్యార్థులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కుషాయిగూడ సీఐ భాస్కర్ రెడ్డి పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.
ఈ ర్యాలీలో విద్యార్థులు యోగా గురించి గొప్పతనాన్ని తెలుపుతూ నినాదాలు, సూక్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా భాష్యం విద్యాసంస్థల సిఈఓ చైతన్య మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థలు విద్యతో పాటు సమాజ శ్రేయస్సుపై ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా జీవించగలుగుతారన్నారు.
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కామన్ యోగ ప్రోగ్రాం కార్యక్రమం అవగాహన కల్పించడం కోసమే భాష్యం విద్యా సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
అనంతరం కామన్ యోగా ప్రోగ్రాం కార్యక్రమం ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులకు జెడ్ఈఓ మార్కండేయులు, ప్రిన్సిపాల్స్ బహుమతులతో విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్స్ అమరేశ్వర రావు, స్వాతి, వనిత మేరీ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.