calender_icon.png 21 June, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడిలో అదనపు గదులు

21-06-2025 01:11:56 AM

  1. ఎన్‌బీటీ నగర్‌లో రూ.1.16 కోట్లతో ఏర్పాటు
  2. మేయర్ విజయలక్ష్మి చొరవతో నిధులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.1.16 కోట్ల వ్యయంతో అదనపు గదులు నిర్మించారు. ఆ గదులు ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చొరవతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులకోసం భారీగా నిధులు మంజూరు అయ్యాయి.

ప్రస్తుతం ఉన్న గదులకు అదనంగా మరో భవనం నిర్మిం చేందుకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు కేశవ్‌రావు రూ.20 లక్షలు అందించారు. దీంతో పాటు పలు ప్రభుత్వ పథకాలు కింద రూ.96.85 లక్షలు మొత్తం రూ.1.16 కోట్ల ఖర్చు చేసి స్కూల్ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు.