calender_icon.png 3 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

03-11-2025 02:57:04 AM

ఉప్పల్, నవంబర్ 2 (విజయక్రాంతి) : వైన్ షాప్, బార్ల వద్ద పార్కింగ్ చేసిన బైకులనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడే ఓ ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు నాచారం ఇన్‌స్పెక్టర్ ధనంజయగౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం. కేశవర్ శంకర్ సింగ్ సెప్టెంబర్ 22న తన బైక్‌ను మల్లాపూర్ వైన్ పార్క్ వద్ద  పార్క్ చేసి లోపటికి వెళ్లి బయటికి వచ్చేసరికి బైకు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికిన దొరకపోవడంతో బైకు దొంగతనానికి గురైనట్లు నాచారం పోలీసులకు  ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు నాచారం ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దర్యాప్తును ప్రారంభించగా బైకు దొంగతనం చేసింది రాజపేట మండలం యాదాద్రి భువనగిరికి జిల్లాకు చెందిన  సాయి ప్రసాద్‌గా గుర్తించారు. నిందితుడని అదుపులోకి తీసుకుని విచారించగా ఐదు ద్విచక్రవాహనాలను దొంగిలిచినట్లు విచారణలో తేలింది. అలాగే బాచుపల్లి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బైకులు దొంగలిచ్చినట్లు ఒప్పుకున్నాడు. కేవలం వైన్ షాపులు, బార్ల వద్ద పార్క్ చేసిన బైకుల టార్గెట్ చేస్తూ వాటిని విక్రయిస్తూ జల్సాలకు చేసుకొనేవాడు.