17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సోషల్ మీడియాలో అమ్మాయికి వేధింపులు వ్యక్తి అరెస్ట్

19-04-2025 12:00 AM

బోథ్, ఏప్రిల్ 18 (విజయ క్రాం తి): సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయి ని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకూర్తి గ్రామానికి చెందిన అలీమ్‌బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు  తరలించామని బోథ్ ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

నిందితుని పై రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని, అలాగే డిచ్పల్లి పోలీస్ స్టేషన్‌లో మోటర్ సైకిల్ దొంగతనం కేసు సైతం ఉందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా  అసభ్యకర పోస్టులు పెట్టిన, వేధించిన, తప్పుడు సమాచారాలు పెట్టిన  అలాంటి వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.